సహోదరుడు భక్త్ సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన
"అలసిన వానికి ఊరడించు మాటలు"
“కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. ఆలాగు చేసి ఆ రొట్టెను తిని, ఆ పాత్ర లోనిది త్రాగవలెను, ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగు వాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులును రోగులునై యున్నారు”.
(1 కొరింతి 11:28-30)
మన ప్రభువైనయేసు క్రీస్తు యొక్క కోరిక ఏమనగా ఆయన సంఘము “కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను, నిర్దోష మైనదిగాను , మహిమ గల సంఘము గాను” ఆయన ఎదుట నిలువ బెట్ట బడ వలెనను నదియే. అది ఆయన కోరిక మాత్రమే కాదు. దానికొరకు ఆయన అన్ని ఏర్పాట్లు చేసెను.( యూదా 24;2 2 వ దెస్స 1:10: ;1 వ యోహాను 3:1-3; యోహాను 6: 36-57). ఆయన కోరిన రీతిగా మనము కళంకమైనను దోషమైనను లేకుండా దేవుడు కోరిన పరిమాణమును మన యెదుట నుంచు కొనవలెను. ఆయనను పోలినవారముగా, ఆయన కుమారుని యొక్క సారూప్యమునకు మార్చబడిన వారముగా మనముండవలెనని ఆయన కోరుచున్నాడు. మన మాయనకు విధేయత చూపిన యెడల, ఆయన తన జీవమును మనలో,మన ద్వారా సమృద్ధిగా కుమ్మరించగలడు.
మనము ప్రభువు బల్ల చుట్టు చేరి వచ్చినప్పుడు మనము ప్రభువు చుట్టు చేరి యున్నామని జ్ఞాపకముంచుకొనవలెను. మన పరిమాణము ఆయనయే. ఏ బోధకుడో, ఉపదేశకుడో లేక తక్కినవారో కాదు. మనము ఇతర మనష్యులవలె, గొప్ప పరిశుద్ధులవలె , గొప్ప బోధకులవలె, చివరకు అపోస్తలుడైన పౌలువలె వుండుటకు కూడ ప్రయత్నించరాదు. మన మాయనవలె నుండ వలెనని ప్రభువు కోరుచున్నాడు .మనము పలుకు ప్రతి మాట, ప్రతి తలంపు, ప్రతి ప్రణాళిక ఆయన పరిపూర్ణ మార్గమును అనుసరించునదిగా నుండ వలెను అని కోరుచున్నాడు. “ప్రభువా! నీవు నా జీవితముతో తృప్తి కలిగి యున్నావా? ఇతరులు తృప్తి పడి యుండవచ్చును. మరియు నీవు తృప్తి పడితివా? నీవు నా జీవితమును బట్టి సంపూర్ణముగా తృప్తి కలిగి యున్నవా?” “నా జీవితము నా ప్రభువుకు సంపూర్ణమైన ఆనందమును, ప్రీతిని కలిగించుచున్నదా?”అని మనలను మనము పరీక్షించుకోనవలెను.ఆ తరువాతనే “ప్రభువా! నీవు నా జీవితముతో సంపూర్ణముగా తృప్తి పొందుచున్నావా?” అని అడుగవలెను. ఆయన మరణమును గూర్చి మనము ఆలోచించక మునుపు ఆయన ఆత్మ మనలో ప్రసవవేదన పడుటను చూడగలడా? చూసి తృప్తి చెందగలడా? ఆయన పునరుర్ధానమును గూర్చి ఆలోచించునప్పుడు మనము నిజముగా అయన సంపూర్ణతతో నూతన జీవము కలిగి నడుచుకొనుచున్నామా? అని మనలను మనము ప్రశ్నించుకొనవలెను. దేవుడు నా జీవితమును బట్టి ఎంతగా ఆనందించుచున్నాడు? ఆయన కుమారుని యొక్క సారూప్యము లోనికి నేను వచ్చి యున్నానా? నా ద్వారా దేవుని పునరుర్ధానజీవము , ఆయన శక్తి వ్యక్తము చేయబడు చున్నవా ? అని స్వపరీక్ష చేసి కొనుట ముఖ్యమైన విషయము.
మనము ఆయన బల్ల చుట్టు చేరి వచ్చినప్పుడు ఆయనకు సంపూర్ణ ఆనందమును సంతోషమును కలుగునట్లు , మన సంపూర్ణ ఆరాధనను , స్తుతిని, ప్రేమను ఆయనకు అర్పించుదము గాక!
“కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. ఆలాగు చేసి ఆ రొట్టెను తిని, ఆ పాత్ర లోనిది త్రాగవలెను, ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగు వాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులును రోగులునై యున్నారు”.
(1 కొరింతి 11:28-30)
మన ప్రభువైనయేసు క్రీస్తు యొక్క కోరిక ఏమనగా ఆయన సంఘము “కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను, నిర్దోష మైనదిగాను , మహిమ గల సంఘము గాను” ఆయన ఎదుట నిలువ బెట్ట బడ వలెనను నదియే. అది ఆయన కోరిక మాత్రమే కాదు. దానికొరకు ఆయన అన్ని ఏర్పాట్లు చేసెను.( యూదా 24;2 2 వ దెస్స 1:10: ;1 వ యోహాను 3:1-3; యోహాను 6: 36-57). ఆయన కోరిన రీతిగా మనము కళంకమైనను దోషమైనను లేకుండా దేవుడు కోరిన పరిమాణమును మన యెదుట నుంచు కొనవలెను. ఆయనను పోలినవారముగా, ఆయన కుమారుని యొక్క సారూప్యమునకు మార్చబడిన వారముగా మనముండవలెనని ఆయన కోరుచున్నాడు. మన మాయనకు విధేయత చూపిన యెడల, ఆయన తన జీవమును మనలో,మన ద్వారా సమృద్ధిగా కుమ్మరించగలడు.
మనము ప్రభువు బల్ల చుట్టు చేరి వచ్చినప్పుడు మనము ప్రభువు చుట్టు చేరి యున్నామని జ్ఞాపకముంచుకొనవలెను. మన పరిమాణము ఆయనయే. ఏ బోధకుడో, ఉపదేశకుడో లేక తక్కినవారో కాదు. మనము ఇతర మనష్యులవలె, గొప్ప పరిశుద్ధులవలె , గొప్ప బోధకులవలె, చివరకు అపోస్తలుడైన పౌలువలె వుండుటకు కూడ ప్రయత్నించరాదు. మన మాయనవలె నుండ వలెనని ప్రభువు కోరుచున్నాడు .మనము పలుకు ప్రతి మాట, ప్రతి తలంపు, ప్రతి ప్రణాళిక ఆయన పరిపూర్ణ మార్గమును అనుసరించునదిగా నుండ వలెను అని కోరుచున్నాడు. “ప్రభువా! నీవు నా జీవితముతో తృప్తి కలిగి యున్నావా? ఇతరులు తృప్తి పడి యుండవచ్చును. మరియు నీవు తృప్తి పడితివా? నీవు నా జీవితమును బట్టి సంపూర్ణముగా తృప్తి కలిగి యున్నవా?” “నా జీవితము నా ప్రభువుకు సంపూర్ణమైన ఆనందమును, ప్రీతిని కలిగించుచున్నదా?”అని మనలను మనము పరీక్షించుకోనవలెను.ఆ తరువాతనే “ప్రభువా! నీవు నా జీవితముతో సంపూర్ణముగా తృప్తి పొందుచున్నావా?” అని అడుగవలెను. ఆయన మరణమును గూర్చి మనము ఆలోచించక మునుపు ఆయన ఆత్మ మనలో ప్రసవవేదన పడుటను చూడగలడా? చూసి తృప్తి చెందగలడా? ఆయన పునరుర్ధానమును గూర్చి ఆలోచించునప్పుడు మనము నిజముగా అయన సంపూర్ణతతో నూతన జీవము కలిగి నడుచుకొనుచున్నామా? అని మనలను మనము ప్రశ్నించుకొనవలెను. దేవుడు నా జీవితమును బట్టి ఎంతగా ఆనందించుచున్నాడు? ఆయన కుమారుని యొక్క సారూప్యము లోనికి నేను వచ్చి యున్నానా? నా ద్వారా దేవుని పునరుర్ధానజీవము , ఆయన శక్తి వ్యక్తము చేయబడు చున్నవా ? అని స్వపరీక్ష చేసి కొనుట ముఖ్యమైన విషయము.
మనము ఆయన బల్ల చుట్టు చేరి వచ్చినప్పుడు ఆయనకు సంపూర్ణ ఆనందమును సంతోషమును కలుగునట్లు , మన సంపూర్ణ ఆరాధనను , స్తుతిని, ప్రేమను ఆయనకు అర్పించుదము గాక!
Comments
Post a Comment