బిక్షమెత్తుకునే కుంటివాడు దేవుడు చేసినమేలుని బట్టి ఏమిచేశాడో తెలుసా

బిక్షమెత్తుకునే కుంటివాడు దేవుడు చేసినమేలుని బట్టి ఏమిచేశాడో తెలుసా ?

పుట్టినది మొదలుకొని కుంటివాడైన యొక మనుష్యుడు ఉండెను వాడు దేవాలయములోనికి వెళ్లువారిని భిక్షమడుగుటకు ప్రతిదినము శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద ఉండెను
పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింప బోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా .. వారు "నజరేయుడైన యేసు క్రీస్తు నామమున" నడువుమని చెప్పెను వెంటనే వాని పాదములును చీలమండలును బలము పొందెను,,
ఆ కుంటివాడైన భిక్షగాడు నడిచినతరువాత ఏమిచేశాడో తెలుసా ?

1.దేవుడు తనకు చేసిన మేలును బట్టి .. "నడుచుచు గంతులు వేసెను "

2.దేవుడు తనకు చేసిన మేలును బట్టి... "దేవుని స్తుతించెను "

3..దేవుడు తనకు చేసిన మేలును బట్టి..." దేవాలయములోనికి వెళ్లెను"

4.దేవుడు తనకు చేసిన మేలును బట్టి..." ప్రజలముందు దేవుని ఘనపరచెను"

👉అయితే మనసంగతి ఏంటి ?
👉ఎన్నో మేలులు నజరేయుడైన ఏసు నామమున పొందాము కానీ 🔺ఎవరికైనా నీకు కలిగిన మేలులు గూర్చి చెప్పవ ?,
🔺సంతోషముతో గంతులు వేసావా ?,
🔺నిరంతరం అయన సన్నిధిలో ఉంటున్నావా ?

👉 ఆలోచించు
ముఖ్యముగా మనం తెలుసుకోవాలిసింది ఇక్కడ ఆ కుంటివాడు తనకు మేలు జరిగాక తన ఇంటికి వెళ్ళలేదు గాని మందిరమునకు వెళ్ళాడు ...
దేవుని ఘనపరచుట అంటే ఇది.....








Comments

Popular posts from this blog

పౌలు జీవిత చరిత్ర

ఉదయకాల ప్రార్ధన

ప్రసంగ సూత్రాలు